‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ : పిల్లలేమయ్యారని మనోహరిని నిలదీసిన అమర్.. భాగమతి చెంతకు చేరిన పిల్లలు!

by Disha Web Desk 7 |
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ : పిల్లలేమయ్యారని మనోహరిని నిలదీసిన అమర్.. భాగమతి చెంతకు చేరిన పిల్లలు!
X

దిశ, సినిమా : రోజురోజుకీ ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతున్న సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. ఒక ఆర్మీ లెఫ్టినెంట్ కుటుంబ కథతో సాగుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అరుంధతి చనిపోవడంతో కథలో ట్విస్ట్ ఇచ్చిన ఈ సీరియల్ ఈరోజు(సెప్టెంబర్06) ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

రాథోడ్ పిల్లలకోసం రోడ్లవెంట తిరుగుతూ ఉంటాడు. మనోహరి రాథోడ్ దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. తనను పిల్లలు మోసం చేసి వెళ్లారని బాధపడతాడు రాథోడ్. నిజానికి వాళ్లు పారిపోతున్నట్టు పొద్దున్నే చెప్పారని, తానే పట్టించుకోలేదని వాపోతాడు. విషయం అమరేంద్రకు తెలిస్తే చాలా ప్రమాదమని సాయంత్రంలోపు పిల్లలను వెతికి పట్టుకుని తీరాలని రాథోడ్‌కు చెబుతుంది మనోహరి. బస్సు అరగంట ముందే బయలుదేరుతుందని చెప్పడానికి ట్రావెల్స్ నుంచి ఫోన్ చేస్తారు. అదే సమయంలో ట్రావెల్స్ నుంచి రాథోడ్‌కు ఫోన్ వస్తుంది. కానీ లోన్ తీసుకోమని వేధించేవాళ్లు ఫోన్ చేశారేమోనని అరిచి కట్ చేస్తాడు రాథోడ్.

పిల్లలు కనపడకుండా పోవడంతో అరుంధతి బాధపడుతుంది. ఏం జరిగిందో తెలుసుకొమ్మని చిత్రగుప్తుడిని బతిమాలుతుంది. పిల్లలకోసం కంటతడి పెడుతున్న అరుంధతిని చూసి బాధపడతాడు చిత్రగుప్తుడు. ఆడపిల్ల జీవితం ఎంత విచిత్రమైనదంటూ ఆమెను ఓదారుస్తాడు. కంటోన్మెంట్ నుంచి అమర్ ఇంటికి రావడంతో పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టారా అని ఆరా తీస్తాడు. కానీ నీల తడబడుతుంది. మనోహరి ఎక్కడికి వెళ్లిందని అడుగుతాడు అమర్. ఏదో పనుందని బయటకు వెళ్లిందని చెప్పి తప్పించుకుంటుంది నీల.

రాథోడ్ ఫోన్ తీయడం లేదని వస్తే తన రూమ్‌కు రమ్మని చెప్పమని వెళతాడు అమర్. నీల వెంటనే మనోహరికి ఫోన్ చేసి అమర్ ఇంటికి వచ్చిన విషయం చెప్పి త్వరగా ఇంటికి రమ్మంటుంది. అమర్‌కు విషయం తెలిస్తే తన పని అయిపోతుందని భయపడుతూ ఇంటికి వస్తుంది మనోహరి. ఇంటికి రాగానే హాల్లో అమర్ ఎదురుపడటంతో తడబడుతుంది. పిల్లల గురించి అమర్ మనోహరిని అడుగుతాడు. తానే రాథోడ్‌కు లంచ్ బాక్సులు ఇచ్చి పంపానని చెబుతుంది మనోహరి.

సాయంత్రం వరకు ఎక్కడైనా టైమ్ పాస్ చేయాలనే ప్లాన్ కోసం ఆలోచిస్తారు పిల్లలు. ఏదైనా బండి కింద పడితే వాళ్లే ఇంటికి తీసుకెళతారని ప్లాన్ చెబుతుంది అంజలి. అనుకున్నట్లే ఆనంద్ బండి కింద పడిపోవడానికి రెడీ అవుతాడు. అప్పుడే కంటోన్మెంట్ నుంచి వస్తున్న భాగమతి బండినే ఎంచుకుంటారు పిల్లలు. ప్లాన్ ప్రకారం బండికి అడ్డంగా నిల్చుని బ్రేక్ వెయ్యగానే పడిపోతాడు ఆనంద్. యాక్సిడెంట్ అయ్యిందని, కాలు లేవడం లేదంటూ ఏడుస్తాడు ఆనంద్. మిగతా పిల్లలు కూడా వచ్చి ఆనంద్‌కు వంతపాడతారు. భాగమతికి మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా బండి మీద కూర్చుని తమని రూమ్‌కు తీసుకెళ్లమంటారు పిల్లలు. భాగమతి పిల్లల ప్లాన్ కనిపెడుతుందా? పిల్లలు ఎలా ఇంటికి చేరతారు? తెలియాలంటే ఈ రోజు సెప్టెంబర్ 06న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!

Read More: డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ‘అలా నిన్ను చేరి’ టైటిల్ సాంగ్ రిలీజ్

Next Story

Most Viewed